Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
05-01-2026 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి తేజ కిరాణం & జనరల్ స్టోర్ ను సోమవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయి వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

గ్రామస్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్వయం ఉపాధి ప్రయత్నాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ఉపాధి పథకాలను వినియోగించుకొని యువత, మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని సూచించారు.

నూతనంగా ప్రారంభమైన ఈ కిరాణం స్టోర్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గౌడ్,నారాపాక ధర్మయ్య, పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

Article Image
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి తేజ కిరాణం & జనరల్ స్టోర్ ను సోమవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయి వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

గ్రామస్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్వయం ఉపాధి ప్రయత్నాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ఉపాధి పథకాలను వినియోగించుకొని యువత, మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని సూచించారు.

నూతనంగా ప్రారంభమైన ఈ కిరాణం స్టోర్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గౌడ్,నారాపాక ధర్మయ్య, పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News