స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి తేజ కిరాణం & జనరల్ స్టోర్ ను సోమవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయి వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
గ్రామస్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్వయం ఉపాధి ప్రయత్నాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ఉపాధి పథకాలను వినియోగించుకొని యువత, మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని సూచించారు.
నూతనంగా ప్రారంభమైన ఈ కిరాణం స్టోర్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గౌడ్,నారాపాక ధర్మయ్య, పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి