స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, నేతాజీ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. వారి జీవితం ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా యువత నేతాజీ ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగభావం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాచేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్, తదితర ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి