Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:39 AM

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
23-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, నేతాజీ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. వారి జీవితం ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా యువత నేతాజీ ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగభావం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాచేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్, తదితర ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, నేతాజీ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. వారి జీవితం ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా యువత నేతాజీ ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగభావం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాచేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్, తదితర ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News