Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకుంటున్న ఫరిదా బేగం

స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకుంటున్న ఫరిదా బేగం

స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకుంటున్న ఫరిదా బేగం
February 06, 2026 05:58 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్

13వ వార్డు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి ఫరిదా బేగం జావీద్‌కు రోజురోజుకీ ప్రజాధారణ పెరుగుతోంది. అధికార ఆశతో కాదు, అభివృద్ధి సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచిన ఆమె ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.వార్డులో నెలకొన్న మౌలిక వసతుల లోపాలు, పారిశుధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి, పేదల సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండాగా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, శుభ్రమైన వీధులు, సురక్షిత తాగునీరు, మెరుగైన అంతర్గత రోడ్లు, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఫరిదా బేగం జావీద్ మాట్లాడుతూ…“నాకు అధికారం కాదు – అభివృద్ధి కావాలి. ప్రజల సేవే నా లక్ష్యం. ఒక్కసారి అవకాశం ఇస్తే 13వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాను” అని భరోసా ఇచ్చారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సమస్యలకు వెంటనే స్పందిస్తున్న తీరుకు మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు.వార్డులో కొనసాగుతున్న ప్రచారం రోజురోజుకీ మరింత ఉత్సాహంగా సాగుతూ, ప్రజల చురుకైన భాగస్వామ్యంతో విశేష స్పందనను పొందుతోంది. 13వ వార్డు భవిష్యత్తు కోసం ఫరిదా బేగం జావీద్‌పై ప్రజల్లో ఆశాభావం రోజురోజుకీ పెరుగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News