Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 AM

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...
February 22, 2026 05:59 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి నిత్య కళ్యాణ మహోత్సవం.

ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ.

శోభాయమనంగా జల నారాయణుడికి నక్షత్ర హారతులు.

భువనగిరి టౌన్:తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో శనివారం రోజు ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనీ మాయ శోభిత స్వర్ణ భరణములతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ అష్ట లక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలు అనగా పసుపు సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ అర్చక స్వాములు కర్పూర మంగళ హారతులను సమర్పించారు. ఉదయం 10:30కు శ్రీవారికి పట్టుపితంరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలతో అలంకరించి నిత్య కళ్యాణం మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యుల దివ్య కరములచే అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. స్వామివారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు నేటి సాయంత్రం ఆలయ తిరుమల వీధులలో స్వర్ణగిరీష్యుని ఊరేగించగా స్వర్ణగిరి మాడవీధులు గోవింద నామాలతో మారు మోగాయి. శనివారం సందర్భంగా ఆలయానికే ఆకర్షణీయంగా నిలిచిన జల నారాయణస్వామి వారికి నక్షత్ర మంగళహారతులను ఆలయ అర్చక స్వాములు సమర్పించారు. ఈరోజు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు , చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News