స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...
స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...
Sthanikam District Staff Reporter
అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి నిత్య కళ్యాణ మహోత్సవం.
ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ.
శోభాయమనంగా జల నారాయణుడికి నక్షత్ర హారతులు.
భువనగిరి టౌన్:తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో శనివారం రోజు ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనీ మాయ శోభిత స్వర్ణ భరణములతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ అష్ట లక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలు అనగా పసుపు సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ అర్చక స్వాములు కర్పూర మంగళ హారతులను సమర్పించారు. ఉదయం 10:30కు శ్రీవారికి పట్టుపితంరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలతో అలంకరించి నిత్య కళ్యాణం మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యుల దివ్య కరములచే అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. స్వామివారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు నేటి సాయంత్రం ఆలయ తిరుమల వీధులలో స్వర్ణగిరీష్యుని ఊరేగించగా స్వర్ణగిరి మాడవీధులు గోవింద నామాలతో మారు మోగాయి. శనివారం సందర్భంగా ఆలయానికే ఆకర్షణీయంగా నిలిచిన జల నారాయణస్వామి వారికి నక్షత్ర మంగళహారతులను ఆలయ అర్చక స్వాములు సమర్పించారు. ఈరోజు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు , చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి