స్వర్ణగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...
స్వర్ణగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...
Sthanikam District Staff Reporter
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఈఓ అమర్నాథ్.
భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆలయ ఈవో అమర్నాథ్,సిపిఆర్ఓ సాయిబాబా,హెచ్ ఆర్ మూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వర్ణగిరి దేవస్థానంలో పనిచేస్తున్న మహిళ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమితో పాటు సమస్త ప్రకృతిని స్త్రీ మూర్తిగా ఆరాధిస్తూ.. గౌరవిస్తారు.మన భారతీయులు మాతృ దేవోభవ అని దైవంగా పూజిస్తాం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగం అంటూ ఉండదంటే అతిశయక్తి కాదు. తల్లిగా గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవి వెల కట్టలేనివని,స్త్రీ లేకపోతే జననం లేదు.స్త్రీ లేకపోతే గమనం లేదు.స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు.స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు.మహిళ అంటే కేవలం ప్రేమ సహనం త్యాగమే కాదు.అన్ని రంగాలలో నాణ్యత సామర్థ్యమే తోపాటు స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాలలో తమ ఉనికిని చాటుతూ సమాజ ప్రగతిలో భాగస్వాములవుతున్నారని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి