Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:39 AM

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు...   ‌‌
February 11, 2026 05:15 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హాజరైన ఆళ్వార్ తిరునగరి ఎంబెరుమానర్ రంగ రామానుజ జీయర్ స్వామి.

స్వర్ణగిరిలో ఘనంగా లక్ష్మీనారాయణ ఇష్టిహవనం.

బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వర్ణగిరిశుడు.

తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో రెండవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రాన్ని దగదగా మెరిసే విద్యుదీపాలతో అలంకరించారు. నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం రోజు అన్యోన్య దాంపత్యం కొరకు లక్ష్మీనారాయణ ఇష్టిహవనంను నిర్వహించారు. నేడు దేవాలయానికి అళ్వార్ తిరునగిరి ఎంబెరుమానర్ జీయర్ మఠం రంగా రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రంలో ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడుని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికిపైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News