Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు...   ‌‌
February 11, 2026 05:15 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హాజరైన ఆళ్వార్ తిరునగరి ఎంబెరుమానర్ రంగ రామానుజ జీయర్ స్వామి.

స్వర్ణగిరిలో ఘనంగా లక్ష్మీనారాయణ ఇష్టిహవనం.

బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వర్ణగిరిశుడు.

తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో రెండవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రాన్ని దగదగా మెరిసే విద్యుదీపాలతో అలంకరించారు. నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం రోజు అన్యోన్య దాంపత్యం కొరకు లక్ష్మీనారాయణ ఇష్టిహవనంను నిర్వహించారు. నేడు దేవాలయానికి అళ్వార్ తిరునగిరి ఎంబెరుమానర్ జీయర్ మఠం రంగా రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రంలో ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడుని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికిపైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News