స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...
స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...
Sthanikam District Staff Reporter
మహత్తర ఘట్టాన్ని చూసి తరించిన భక్తజనులు.
యాదాద్రి భువనగిరి జిల్లా: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రోజు అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 19న ఉదయం సరిగ్గా 7 గంటలకు సూర్య భగవానుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి పాద పద్మాలను స్పర్శించాయి. గతంలో భీష్మ ఏకాదశి నాడు జరిగిన ఈ అపురూప ఘట్టం,నేడు మళ్ళీ పునరావృతమైంది.ఇది ఆలయ నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మిక రహస్యానికి నిదర్శనమని భక్తులు కొనియాడారు. సూర్య కిరణాల వెలుగులో స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగి పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తిపరవశంలో మునిగి పోయారు. ఈ 'సూర్య కిరణార్చన'మరో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20,21 తేదీల్లో) కూడా ఉదయం 7 గంటలకు పునరావృతం అవుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు,ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ,గోపికృష్ణలు,ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణా చార్యులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి