Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:28 AM

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...
19-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మహత్తర ఘట్టాన్ని చూసి తరించిన భక్తజనులు.

యాదాద్రి భువనగిరి జిల్లా: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రోజు అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 19న ఉదయం సరిగ్గా 7 గంటలకు సూర్య భగవానుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి పాద పద్మాలను స్పర్శించాయి. గతంలో భీష్మ ఏకాదశి నాడు జరిగిన ఈ అపురూప ఘట్టం,నేడు మళ్ళీ పునరావృతమైంది.ఇది ఆలయ నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మిక రహస్యానికి నిదర్శనమని భక్తులు కొనియాడారు. సూర్య కిరణాల వెలుగులో స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగి పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తిపరవశంలో మునిగి పోయారు. ఈ 'సూర్య కిరణార్చన'మరో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20,21 తేదీల్లో) కూడా ఉదయం 7 గంటలకు పునరావృతం అవుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు,ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ,గోపికృష్ణలు,ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణా చార్యులు తెలిపారు.

Sthanikam

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...

Article Image

మహత్తర ఘట్టాన్ని చూసి తరించిన భక్తజనులు.

యాదాద్రి భువనగిరి జిల్లా: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రోజు అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 19న ఉదయం సరిగ్గా 7 గంటలకు సూర్య భగవానుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి పాద పద్మాలను స్పర్శించాయి. గతంలో భీష్మ ఏకాదశి నాడు జరిగిన ఈ అపురూప ఘట్టం,నేడు మళ్ళీ పునరావృతమైంది.ఇది ఆలయ నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మిక రహస్యానికి నిదర్శనమని భక్తులు కొనియాడారు. సూర్య కిరణాల వెలుగులో స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగి పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తిపరవశంలో మునిగి పోయారు. ఈ 'సూర్య కిరణార్చన'మరో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20,21 తేదీల్లో) కూడా ఉదయం 7 గంటలకు పునరావృతం అవుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు,ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ,గోపికృష్ణలు,ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణా చార్యులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News