స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం
స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం
Harish HS
నల్లబండగూడెంలో మెగా వైద్య శిబిరం.. 400 మందికి పరీక్షలు.
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కృషి అభినందనీయమని సర్పంచ్ అలసకాని భవాని శరభేశ్వరరావు అన్నారు. గురువారం నల్లబండగూడెం గ్రామంలో చక్కా చన్నయ్య జ్ఞాపకార్థం ఐషు ప్రొడక్ట్స్ అధినేత చక్కా హరిబాబు సహకారంతో యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో దాదాపు 400 మందికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డీ ఎకో మరియు థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సామాజిక సేవలో స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.విశిష్ట అతిథిగా పైడిమర్రి సత్యబాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి కిట్టు,యధా సుధాకర్,ట్రస్ట్ సభ్యులు హైమావతి, శ్రీనివాసరావు, కొత్తూరి శ్రీనివాసరావు,అనిల్ గ్రామ పెద్దలు వైస్ సర్పంచ్ యరమల అరుణ, శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ సుశీల బెంజిమన్,రంగారావు గారు,నల్లపాటి నరసింహారావు,సుధాకర్,ముండ్ర శివరామ కృష్ణ,మొదల రాజా,ఎదులాపు నరసింహారావు,ముండ్ర సీతయ్య,మాగంటి ముత్తయ్య,బోయిల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి