స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ
స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ
K.RAVI
యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ – చినుకని యువరాజు
స్వరాజ్య స్థాపనకు ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పర్యావరణ సంరక్షణ యువశక్తి కార్యవిభాగం తెలంగాణ ప్రాంత సహ ప్రముఖ్ చినుకని యువరాజు పేర్కొన్నారు.పంతంగిలో ఘనంగా శివాజీ జయంతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డాక్టర్ జీ శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పంతంగి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జిజియా బాయి సంస్కారాలే శివాజీ మహాత్మ్యం, శివాజీ వ్యక్తిత్వ వికాసానికి ఆయన తల్లి జిజియా బాయి ఇచ్చిన విలువలే పునాదిగా నిలిచాయని యువరాజు తెలిపారు. చిన్ననాటి నుంచే ధైర్యం, దేశభక్తి, ధర్మనిరత భావాలను నూరిపోసినందువల్లే శివాజీ స్వరాజ్య స్థాపనలో విజయం సాధించారని పేర్కొన్నారు.యువత శివాజీ మార్గంలో నడవాలి ప్రతి యువకుడు శివాజీ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
మిర్యాల సంతోష్, బాతరాజు మణికంఠ, అంతటి సంపత్, ఆనగంటి చరణ్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి