స్వామివారి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు – ప్రాంగణం పరిశీలించిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
స్వామివారి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు – ప్రాంగణం పరిశీలించిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
K.RAVI
చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని బాలాజీ రామకృష్ణ దేవాలయం కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి