Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 06:11 PM

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం
March 29, 2026 04:03 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతుంది.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్లా వరహాల రెడ్డి మాట్లాడుతూ.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రియల్ రెండవ తారీకు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 నుండి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కబడ్డీ క్రికెట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోదాడ మండల వ్యాప్తంగా ఉన్న భక్తులు, గ్రామ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్యలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News