Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:26 AM

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం
29-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతుంది.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్లా వరహాల రెడ్డి మాట్లాడుతూ.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రియల్ రెండవ తారీకు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 నుండి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కబడ్డీ క్రికెట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోదాడ మండల వ్యాప్తంగా ఉన్న భక్తులు, గ్రామ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్యలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Sthanikam

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

Article Image

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతుంది.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్లా వరహాల రెడ్డి మాట్లాడుతూ.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రియల్ రెండవ తారీకు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 నుండి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కబడ్డీ క్రికెట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోదాడ మండల వ్యాప్తంగా ఉన్న భక్తులు, గ్రామ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్యలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News