సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం
సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ హీటెక్కిన రాజకీయ “దమ్ముంటే ఆలయానికి రా” అన్న సవాల్కు — ఫైళ్లతో, జీఓలతో సమాధానం
నిన్న, మొన్న పక్క పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. “దమ్ముంటే కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గరకు రా… నువ్వు ఏం తెచ్చావో చూపించు” అంటూ చేసిన సవాల్కు అధికార పక్షం నేత గట్టి సమాధానం ఇచ్చారు.
“ఇదిగో… ఇవే మేము తెచ్చినవి” అంటూ పత్రాలు, జీఓలు బయటపెట్టారు.
పట్టణ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాల్లో చేసిన పనులపై వివరాలు వెల్లడించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రూ. 15 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చామని, దీనికి సంబంధించిన జీఓలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
నీటి శుద్ధి కార్యక్రమాల కోసం
రూ. 20 కోట్ల విలువైన ప్రపోజల్స్ ప్రభుత్వానికి సమర్పించామని చెప్పారు.
పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు
రూ. 12 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశామని వెల్లడించారు.
సహాయ నిధులు – ప్రత్యక్ష మద్దతు
LOC ద్వారా రూ.75 లక్షలు,
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.32 లక్షలు బాధితులకు అందించామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“మేము ఐదు సంవత్సరాల్లో చేసినవి ఇవి… మీరు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?” అంటూ సూటిగాప్రశ్నించారు.ప్రజాసమస్యలపై పోరాటం కాకుండా, దేవాలయాల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కనిపించాలంటే మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్నారు.ఇప్పటికే ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రజలే ఎవరు పనిచేశారు, ఎవరు మాటలకే పరిమితమయ్యారో నిర్ణయిస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి