Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:41 AM

సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం

సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం

సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం  ఎమ్మెల్యే వేముల వీరేశం
February 09, 2026 07:16 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ హీటెక్కిన రాజకీయ “దమ్ముంటే ఆలయానికి రా” అన్న సవాల్‌కు — ఫైళ్లతో, జీఓలతో సమాధానం

నిన్న, మొన్న పక్క పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. “దమ్ముంటే కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గరకు రా… నువ్వు ఏం తెచ్చావో చూపించు” అంటూ చేసిన సవాల్‌కు అధికార పక్షం నేత గట్టి సమాధానం ఇచ్చారు.

“ఇదిగో… ఇవే మేము తెచ్చినవి” అంటూ పత్రాలు, జీఓలు బయటపెట్టారు.

పట్టణ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాల్లో చేసిన పనులపై వివరాలు వెల్లడించారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రూ. 15 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చామని, దీనికి సంబంధించిన జీఓలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

నీటి శుద్ధి కార్యక్రమాల కోసం

రూ. 20 కోట్ల విలువైన ప్రపోజల్స్ ప్రభుత్వానికి సమర్పించామని చెప్పారు.

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు

రూ. 12 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశామని వెల్లడించారు.

సహాయ నిధులు – ప్రత్యక్ష మద్దతు

LOC ద్వారా రూ.75 లక్షలు,

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.32 లక్షలు బాధితులకు అందించామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“మేము ఐదు సంవత్సరాల్లో చేసినవి ఇవి… మీరు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?” అంటూ సూటిగాప్రశ్నించారు.ప్రజాసమస్యలపై పోరాటం కాకుండా, దేవాలయాల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కనిపించాలంటే మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్నారు.ఇప్పటికే ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రజలే ఎవరు పనిచేశారు, ఎవరు మాటలకే పరిమితమయ్యారో నిర్ణయిస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News