స్విన్బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్
స్విన్బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్
స్థానికం బృందం
స్విన్బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్
రామన్నపేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్ చిన్న కుమారుడు అంతటి రాకేష్ గౌడ్ ఉన్నత విద్యాభ్యాస లక్ష్యంతో ఆస్ట్రేలియాకు వెళ్లి మెల్బోర్న్ కేంద్రంగా చదువును కొనసాగించారు.
స్విన్బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో సప్లై చైన్ ఇన్నోవేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా అందుకున్నారు. విదేశీ విద్యలో ప్రతిభ చాటుతూ రాకేష్ గౌడ్ సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ విద్యా వేదిక వరకు రాకేష్ గౌడ్ సాధించిన ప్రగతి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి