Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 01:22 AM

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు అభినందనీయం

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు అభినందనీయం

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు అభినందనీయం
January 08, 2026 12:13 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కళలకు పుట్టినిల్లు సూర్యాపేట

సంగీతమే దైవానికి మార్గం : సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రశంసనీయం అని ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 23వ త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు త్యాగరాజ స్వామి అని పేర్కొన్నారు. శ్రీ సీతారామునిపై అపార భక్తితో, సంగీతాన్ని సాధనగా చేసుకుని దైవాన్ని చేరవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడిగా త్యాగరాజ స్వామిని కొనియాడారు. వేలాది కీర్తనలతో సంగీత ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడి జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సుధా బ్యాంకు కళాకారులను గౌరవిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక–సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం మంచి సంప్రదాయమని అభినందించారు. సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్ది రెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ప్రముఖ రచయిత–జర్నలిస్ట్ పులగం చిన్నారాయణలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సంగీత గాత్ర కచేరిను ఎస్సీ కౌశిక్ కళ్యాణ్ బృందం ఆలపించగా, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మారుతి విద్యాసంస్థల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. అంతకుముందు సుధా బ్యాంకు కార్యాలయం నుంచి త్యాగరాజ స్వామి చిత్రపటానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, పొనుగోటి నిర్మల, మీలాసందీప్, సుజాత, భోనగిరి భాస్కర్, అప్పం శ్రీనివాస్, అనంతుల శారద, పటేల్ నర్సింహారెడ్డి, శశిధర్, ఈశ్వర్ కుమార్, ఏపూరి శ్రవణ్ కుమార్, బొలిశెట్టి మధు, వెంకట్ రెడ్డి, తోట శ్యాం ప్రసాద్, అంజన్ ప్రసాద్, మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీను, కొత్త ఆంజనేయులు, గాలి శీను, గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News