స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు
స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మారుతి పటేల్ తన అనుచరులతో కలసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మారుతి పటేల్ వెంట సుమారు వంద మంది కార్యకర్తలు,అభిమానులు,నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు.ఈ చేరికలతో నారాయణఖేడ్లో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్ వైపు అడుగులు వేసినట్లు చేరిన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి