Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:46 AM

స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు

స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు

స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు
08-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మారుతి పటేల్ తన అనుచరులతో కలసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మారుతి పటేల్ వెంట సుమారు వంద మంది కార్యకర్తలు,అభిమానులు,నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు.ఈ చేరికలతో నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్ వైపు అడుగులు వేసినట్లు చేరిన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

స్థానిక నాయకుల చేరికలతో బీఆర్ఎస్ బలం రెట్టింపు

Article Image

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మారుతి పటేల్ తన అనుచరులతో కలసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మారుతి పటేల్ వెంట సుమారు వంద మంది కార్యకర్తలు,అభిమానులు,నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు.ఈ చేరికలతో నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్ వైపు అడుగులు వేసినట్లు చేరిన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News