స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ
స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:తొర్రూర్ డివిజన్ మున్సిపాలిటీ ఆరో వార్డు అంబేద్కర్ నగర్, మహబూబాబాద్ జిల్లా లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డీకి ఒక వినతి పత్రం అందజేశారు.ఈ పత్రంలో మున్సిపాలిటీ నుండి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు, నిర్లక్ష్యపూర్వకంగా పనులు నడుస్తున్నట్టు, నాణ్యత సమస్యలతో నిర్మాణాలు జరుగుతున్నట్టు వివరించారు. ముఖ్యంగా కేటాయించిన నిధులు పూర్తిగా ఇతర ఉపయోగాలకు వెళ్ళి, సిమెంట్ మరియు ఇటుకల నాణ్యత తక్కువగా ఉండటం, ఫ్యాన్లు, కరెంట్ ప్రహరి, గోడలు వంటి అవసరమైన నిర్మాణ పనులు పూర్తిగా జరగకపోవడం, సమస్యలను పరిష్కరించడానికి ఇతర బడ్జెట్ విభాగాల నుంచి నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నట్టు వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు, మహబూబాబాద్ జిల్లా నర్కుటి రామారాజు, ఇతర కార్యకర్తలు మరియు స్థానిక సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి