Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:19 AM

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం
12-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: హనుమాన్‌ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సతీష్‌నగర్‌ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.

కార్యక్రమానికి బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, టూటౌన్‌ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేష్‌, పబ్బు మౌనిక నరేందర్‌గౌడ్‌ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాసులు, చెదల రమణగౌడ్‌, బండారు శంకర్‌గౌడ్‌, చోళ్ళేటి వెంకటాచారి, రవీంద్రచారి, స్వామి, చెదల నిఖిల్‌గౌడ్‌, పండు, బంటి తదితరులతో పాటు నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

Article Image

నల్లగొండ: హనుమాన్‌ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సతీష్‌నగర్‌ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.

కార్యక్రమానికి బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, టూటౌన్‌ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేష్‌, పబ్బు మౌనిక నరేందర్‌గౌడ్‌ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాసులు, చెదల రమణగౌడ్‌, బండారు శంకర్‌గౌడ్‌, చోళ్ళేటి వెంకటాచారి, రవీంద్రచారి, స్వామి, చెదల నిఖిల్‌గౌడ్‌, పండు, బంటి తదితరులతో పాటు నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News