సతీష్నగర్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం
సతీష్నగర్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం
Editor Desk
నల్లగొండ: హనుమాన్ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సతీష్నగర్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.
కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, టూటౌన్ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేష్, పబ్బు మౌనిక నరేందర్గౌడ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాసులు, చెదల రమణగౌడ్, బండారు శంకర్గౌడ్, చోళ్ళేటి వెంకటాచారి, రవీంద్రచారి, స్వామి, చెదల నిఖిల్గౌడ్, పండు, బంటి తదితరులతో పాటు నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి