Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్...

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్...

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్...
March 21, 2026 04:33 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్

మానవకోటికి ఇది మార్గదర్శకం

అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్

ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్.. మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు.

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ పట్టణం లోని సాలార్జంగ్ పేట ఈద్గా లో రంజాన్ పర్వ దినం ప్రార్థనల అనంతరం మునిసిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ముస్లిం లకు ఈద్ ముబారక్ తెలిపి మాట్లాడారు.

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అని

మానవకోటికి ఇది మార్గదర్శకం అన్నారు.అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహకారం తో కృషి చేస్తామన్నారు. ఈద్గా, షాది ఖానా లకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు నిధులు మంజూరు చేశారన్నారు.

ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్ తెలిపారు. కాగా పాలక వర్గం పక్షాన ముస్లిం ఈద్గా ప్రార్థనలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపట్ల ముస్లిం లు ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, వైస్ ఛైర్మన్ మల్లీశ్వరి,కమిషనర్ రమాదేవి, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, బాగ్దాద్, బాజాన్, అజీమ్, మధర్, సాహెబ్, ఫయాజ్, మునిసిపల్ పలు వార్డుల కౌన్సిలర్ లు,పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News