Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:43 AM

స్త్రీ గౌరవం సమాజ అభివృద్ధికి పునాది. శ్రీ విద్య

స్త్రీ గౌరవం సమాజ అభివృద్ధికి పునాది. శ్రీ విద్య

స్త్రీ గౌరవం సమాజ అభివృద్ధికి పునాది. శ్రీ విద్య
March 07, 2026 06:44 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొన్నేకల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, స్త్రీ లేనిదే సమాజ ప్రగతి సాధ్యం కాదని పేర్కొన్నారు. చిన్నారిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తున్న మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలకు విద్య, ఆత్మవిశ్వాసం, అవకాశాలు కల్పిస్తే వారు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తారని అన్నారు.

కళాశాల కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ నేటి మహిళలు విద్య, సాంకేతికత, వ్యాపారం వంటి అనేక రంగాల్లో విశేష విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాకుండా మహిళల హక్కులు, గౌరవాన్ని గుర్తుచేసుకునే రోజు అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో కీలక స్థానాన్ని కలిగి ఉన్నారని, విద్యార్థినులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మహిళా సిబ్బంది, విద్యార్థినులను సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో పరిపాలన అధికారి వైశాలి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, పద్మజ, డీన్ డాక్టర్ వి. సుదర్శన్, శిక్షణా నియామక అధికారి డాక్టర్ రాజేష్, విద్యుత్ విభాగాధిపతి కృష్ణ ప్రసాద్, డాక్టర్ చార్యులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News