కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు
కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని Canara Bank శాఖలో గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లు ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అత్యవసర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి సులభంగా రుణాలు పొందిన ప్రజలు, తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు.
ఇటీవల ఏప్రిల్ 1 నుండి Reserve Bank of India మార్గదర్శకాల ప్రకారం గోల్డ్ లోన్లపై కొన్ని కఠినమైన షరతులు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
₹10 లక్షల పైగా రుణం తీసుకునే వారికి ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు.
₹2.5 లక్షల పైగా లోన్ తీసుకునే వారు తమ ఆదాయ వనరులపై స్పష్టమైన వివరాలు ఇవ్వాల్సి వస్తోంది.
ప్రతి ₹1 లక్ష రుణానికి సుమారు ₹500 స్టాంప్ ఛార్జీలు విధిస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు.
ఈ నిబంధనలతో పాటు ప్రక్రియ ఆలస్యం, అదనపు పత్రాల సమర్పణ వంటి కారణాలతో గోల్డ్ లోన్ పొందడం కష్టంగా మారిందని బాధితులు తెలిపారు. తక్షణ అవసరాల కోసం బ్యాంకులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
స్థానికులు చెబుతున్నదేమంటే, బ్యాంకులు నియమాలు అమలు చేయడం అవసరమే అయినా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి