Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:53 PM

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!
17-02-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సోషల్ మీడియాలో అలజడి రేపిన కథనం… సురక్షితంగా రత్నమ్మ చేరిక

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన డి. రత్నమ్మ (58) కనిపించకుండా పోయిన ఘటనకు సుఖాంతం లభించింది.

నిన్నటినుంచి ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖేడ్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు.

ఈ నేపథ్యంలో ‘స్థానికం పత్రిక’ లో ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజల్లో చైతన్యం కలిగింది. అనేక మంది ఆ వివరాలను పంచుకోవడంతో విషయం వేగంగా వ్యాపించింది.

దీంతో ఆమెను గమనించిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, రత్నమ్మ ఆచూకీ తెలిసింది.ఆమె సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

ఒక చిన్న సమాచారం కూడా ఒక కుటుంబానికి ఎంతటి ఆశాకిరణమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల స్పందనతో పాటు వార్తను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ‘స్థానికం’ పత్రిక పాత్ర ప్రశంసనీయమని గ్రామస్తులు అభినందించారు.

Sthanikam

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!

Article Image

సోషల్ మీడియాలో అలజడి రేపిన కథనం… సురక్షితంగా రత్నమ్మ చేరిక

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన డి. రత్నమ్మ (58) కనిపించకుండా పోయిన ఘటనకు సుఖాంతం లభించింది.

నిన్నటినుంచి ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖేడ్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు.

ఈ నేపథ్యంలో ‘స్థానికం పత్రిక’ లో ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజల్లో చైతన్యం కలిగింది. అనేక మంది ఆ వివరాలను పంచుకోవడంతో విషయం వేగంగా వ్యాపించింది.

దీంతో ఆమెను గమనించిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, రత్నమ్మ ఆచూకీ తెలిసింది.ఆమె సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

ఒక చిన్న సమాచారం కూడా ఒక కుటుంబానికి ఎంతటి ఆశాకిరణమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల స్పందనతో పాటు వార్తను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ‘స్థానికం’ పత్రిక పాత్ర ప్రశంసనీయమని గ్రామస్తులు అభినందించారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News