‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!
‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!
Krishna
సోషల్ మీడియాలో అలజడి రేపిన కథనం… సురక్షితంగా రత్నమ్మ చేరిక
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన డి. రత్నమ్మ (58) కనిపించకుండా పోయిన ఘటనకు సుఖాంతం లభించింది.
నిన్నటినుంచి ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖేడ్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు.
ఈ నేపథ్యంలో ‘స్థానికం పత్రిక’ లో ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజల్లో చైతన్యం కలిగింది. అనేక మంది ఆ వివరాలను పంచుకోవడంతో విషయం వేగంగా వ్యాపించింది.
దీంతో ఆమెను గమనించిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, రత్నమ్మ ఆచూకీ తెలిసింది.ఆమె సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ఒక చిన్న సమాచారం కూడా ఒక కుటుంబానికి ఎంతటి ఆశాకిరణమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల స్పందనతో పాటు వార్తను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ‘స్థానికం’ పత్రిక పాత్ర ప్రశంసనీయమని గ్రామస్తులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి