Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
February 09, 2026 07:17 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.సోమవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సచివాలయం 1 లో విస్సన్నపేట సత్యసాయి ట్రస్ట్ మరియు చనుబండ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నూజివీడు అమెరికన్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మోరంపూడి శ్రీనివాస రావు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోరంపూడి సూచించారు. ఈ ఉచిత కంటి వైద్యశిబిరం ను ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ ను మోరంపూడి అభినందించారు.ఈ వైద్య శిబిరం లో 109 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.అందులో 50 మందికి కంటి ఆపరేషన్ లు అవసరం కాగా వారిని శస్త్ర చికిత్స కోసం నూజివీడు అమెరికన్ హాస్పటల్ కు పంపారు. మిగిలిన 59 మందికి శిబిరంలోనే మందులు ఇచ్చి పంపారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి ట్రస్ట్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, కుక్కడపు చక్రధర్ రావు, సత్య సాయి భజన మండలి సభ్యులు వనమా ప్రవీణ్, కొక్కెరపాటి లక్ష్మణ రావు, గ్రామస్థులు, పేషెంట్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News