సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
GADDAM JAGANMOHAN REDDY
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.సోమవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సచివాలయం 1 లో విస్సన్నపేట సత్యసాయి ట్రస్ట్ మరియు చనుబండ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నూజివీడు అమెరికన్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మోరంపూడి శ్రీనివాస రావు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోరంపూడి సూచించారు. ఈ ఉచిత కంటి వైద్యశిబిరం ను ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ ను మోరంపూడి అభినందించారు.ఈ వైద్య శిబిరం లో 109 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.అందులో 50 మందికి కంటి ఆపరేషన్ లు అవసరం కాగా వారిని శస్త్ర చికిత్స కోసం నూజివీడు అమెరికన్ హాస్పటల్ కు పంపారు. మిగిలిన 59 మందికి శిబిరంలోనే మందులు ఇచ్చి పంపారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి ట్రస్ట్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, కుక్కడపు చక్రధర్ రావు, సత్య సాయి భజన మండలి సభ్యులు వనమా ప్రవీణ్, కొక్కెరపాటి లక్ష్మణ రావు, గ్రామస్థులు, పేషెంట్ లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి