Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
February 22, 2026 05:59 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పోచంపల్లి: మండల పరిధిలోని జలాల్‌పూర్‌లోని స్వామి రమనంద తీర్థ ఇన్స్టిట్యూట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచుల పాత్ర కీలకమైందని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ రాజు యాక్ట్ 2018 లోని అంశాలు,విధివిధానాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి సర్పంచుల సమర్థ నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే నిధులను పారదర్శకంగా,సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచులకు కల్పించిన అధికారాలు, విధులు,బాధ్యతలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ,తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీడీవోలు,ఎంపీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News