చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన సర్పంచుల సమావేశంలో పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన కాటం వెంకటేశాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఏకం చేసి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తానన్నారు. సర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం ఫోరం వేదికగా సమిష్టి పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి