సర్పంచ్కు ఘన సన్మానం. బోగారం గెలుపే బీఆర్ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య
సర్పంచ్కు ఘన సన్మానం. బోగారం గెలుపే బీఆర్ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
బోగారం గెలుపే బీఆర్ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య
స్థానికం రామన్న పేట ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కూనూరి సాయికుమార్ గౌడ్ 410 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనంగా సన్మానించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సర్పంచ్కు శాలువా కప్పి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గెలుపులో కీలక పాత్ర పోషించిన అంతట రమేష్ సేవలను చిరుమర్తి లింగయ్య ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్, నాయకులు కృష్ణ–అర్జునుల్లా కలిసి ముందుకు సాగాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.అనంతరం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన గ్రామ పెద్దలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బోగారం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి