సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
స్థానికం బృందం
బోగారంలో బీఆర్ఎస్ విజయపతాకం
సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
రామన్నపేట, ప్రతినిధి – కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూనూరి సాయికుమార్ గౌడ్ భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయికుమార్ గౌడ్ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
గ్రామస్థాయి పాలనలో బీఆర్ఎస్పై ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. బోగారం గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంలో సర్పంచ్గా సాయికుమార్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు అంతటి రమేష్ గౌడ్తో పాటు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి