సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
Krishna
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాటస్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను భవిష్యత్ తరాలకు చాటుతున్నామని, వారు నిర్మించిన కోటలను పర్యాటక మరియు పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి