Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:09 PM

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
April 02, 2026 06:13 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాటస్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను భవిష్యత్ తరాలకు చాటుతున్నామని, వారు నిర్మించిన కోటలను పర్యాటక మరియు పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News