Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:02 AM

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...
January 26, 2026 05:50 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వర్ణగిరి క్షేత్రంలో ఘనంగా దివ్య విమాన రథోత్సవం.

భక్తుల గోవింద నామాలతో మారుమోగిన మానేపల్లి హిల్స్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో ఆదివారం రోజు సప్త వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగిన శ్రీనివాసుడు.స్వర్ణగిరి దేవస్థానంలో రథ సప్తమి వేడుకలలో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సప్త వాహనాలు సూర్య ప్రభా వాహనం,చిన్న శేష వాహనం,గజవాహనం,హనుమంత వాహనం,కల్పవృక్ష వాహనం,చంద్ర ప్రభావాహనం ,గరుడ వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణగిరి శ్రీనివాసుడు ఆలయ పురవీధులలో వందలాది మంది భక్తుల గోవిందా నామాలను పటిస్తూ స్వామివారి పల్లకి సేవను మోసేందుకు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. రథసప్తమి వేడుకలలో చిన్నపిల్లలు కూచిపూడి భరతనాట్యం వంటి కార్యక్రమాలరతో ఆలయానికి విచ్చేసిన భక్తులను అలరించారు.మధ్యాహ్నం స్వామివారి నిత్యాన్న ప్రసాద కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.రాత్రి 8గంటలకు స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య విమాన రథోత్సవంపై అధిరోహింప జేసి ఆలయ మాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News