Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...

సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు...
January 26, 2026 05:50 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వర్ణగిరి క్షేత్రంలో ఘనంగా దివ్య విమాన రథోత్సవం.

భక్తుల గోవింద నామాలతో మారుమోగిన మానేపల్లి హిల్స్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో ఆదివారం రోజు సప్త వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగిన శ్రీనివాసుడు.స్వర్ణగిరి దేవస్థానంలో రథ సప్తమి వేడుకలలో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సప్త వాహనాలు సూర్య ప్రభా వాహనం,చిన్న శేష వాహనం,గజవాహనం,హనుమంత వాహనం,కల్పవృక్ష వాహనం,చంద్ర ప్రభావాహనం ,గరుడ వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణగిరి శ్రీనివాసుడు ఆలయ పురవీధులలో వందలాది మంది భక్తుల గోవిందా నామాలను పటిస్తూ స్వామివారి పల్లకి సేవను మోసేందుకు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. రథసప్తమి వేడుకలలో చిన్నపిల్లలు కూచిపూడి భరతనాట్యం వంటి కార్యక్రమాలరతో ఆలయానికి విచ్చేసిన భక్తులను అలరించారు.మధ్యాహ్నం స్వామివారి నిత్యాన్న ప్రసాద కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.రాత్రి 8గంటలకు స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య విమాన రథోత్సవంపై అధిరోహింప జేసి ఆలయ మాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News