సౌత్ జోన్ ఫుట్బాల్కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక
సౌత్ జోన్ ఫుట్బాల్కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక
Editor Desk
సౌత్ జోన్ ఫుట్బాల్కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక
స్థానిక ప్రతినిధి
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తిరుమల సిరి (బి.ఏ–ఈహెచ్పి) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
ఈనెల 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఫుట్బాల్ పోటీల్లో తిరుమల సిరి పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, ఇన్చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా. ఏ. మల్లేశంలు విద్యార్థినిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. మునిస్వామి, హిస్టరీ అధ్యాపకుడు నర్సింగ్ కోటయ్య, ఎన్సీసీ ఆఫీసర్ సిహెచ్. సుధాకర్, డా. అంకుష్ తదితరులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి