Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..
December 30, 2025 01:42 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham
జనవరి 3,4న కవిత పర్యటన
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్న ‘జనంబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జాగృతి ముఖ్య నాయకులతో కలిసి ‘జనంబాట’ గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 3న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో, 4న కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించి ప్రజలతో నేరుగా మమేకం కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఈ పర్యటన కొనసాగుతుందని వెల్లడించారు.

‘సామాజిక తెలంగాణ’ సాధనే లక్ష్యంగా చేపట్టిన జనంబాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, చందుల మధు, జితేందర్, సాయి గౌడ్, ఉమారాణి, సైదిరెడ్డి, నకిరెకంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News