సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..
సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..
Biksham
జనవరి 3,4న కవిత పర్యటన
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్న ‘జనంబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జాగృతి ముఖ్య నాయకులతో కలిసి ‘జనంబాట’ గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 3న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో, 4న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించి ప్రజలతో నేరుగా మమేకం కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఈ పర్యటన కొనసాగుతుందని వెల్లడించారు.
‘సామాజిక తెలంగాణ’ సాధనే లక్ష్యంగా చేపట్టిన జనంబాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, చందుల మధు, జితేందర్, సాయి గౌడ్, ఉమారాణి, సైదిరెడ్డి, నకిరెకంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి