సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ
భువనగిరి, స్థానికం ప్రతినిధి:
జనవరి 4న సూర్యాపేటలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల మహాసభల కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య బుధవారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా సలహాదారులు బట్టు రామచంద్రయ్యతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాకారం లావణ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించి నాలుగు గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా “తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు” ఏర్పాటు చేయాలన్నారు.
జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించే మహాసభలకు ఉద్యమకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు రత్నపురం పద్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు భాస్కర్ నాయక్, రాణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి