Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:03 AM

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన
18-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి మండలం సూరేపల్లి గ్రామ పరిధిలోని ఆకుతోటి బావి తండాకు చెందిన సాలి ధనావత్ ప్రతిష్టాత్మక ఘనత సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టాను ఆమె సొంతం చేసుకున్నారు.

బంజారా మౌఖిక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఏలె విజయలక్ష్మి పర్యవేక్షణలో “యాదాద్రి జిల్లా బంజారా మౌఖిక కథలు – సమగ్ర అధ్యయనం” అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు.

ఈ సందర్భంగా తనను శిష్యవాత్సల్యంతో ప్రోత్సహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కాశీం, కమలాకర శర్మ, సూర్య ధనంజయ్, డాక్టర్ ఎస్. రఘు లకు సాలి ధనావత్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డాక్టరేట్ సాధనలో నిరంతరం తోడుగా నిలిచిన భర్త కెతావత్ మురళీ నాయక్, అత్తమ్మ కేతావత్ చాయమ్మ, మామయ్య నర్సింహలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సాలి ధనావత్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సాహిత్యానికి ఆమె చేసిన కృషి యువ పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.

Sthanikam

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

Article Image

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి మండలం సూరేపల్లి గ్రామ పరిధిలోని ఆకుతోటి బావి తండాకు చెందిన సాలి ధనావత్ ప్రతిష్టాత్మక ఘనత సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టాను ఆమె సొంతం చేసుకున్నారు.

బంజారా మౌఖిక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఏలె విజయలక్ష్మి పర్యవేక్షణలో “యాదాద్రి జిల్లా బంజారా మౌఖిక కథలు – సమగ్ర అధ్యయనం” అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు.

ఈ సందర్భంగా తనను శిష్యవాత్సల్యంతో ప్రోత్సహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కాశీం, కమలాకర శర్మ, సూర్య ధనంజయ్, డాక్టర్ ఎస్. రఘు లకు సాలి ధనావత్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డాక్టరేట్ సాధనలో నిరంతరం తోడుగా నిలిచిన భర్త కెతావత్ మురళీ నాయక్, అత్తమ్మ కేతావత్ చాయమ్మ, మామయ్య నర్సింహలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సాలి ధనావత్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సాహిత్యానికి ఆమె చేసిన కృషి యువ పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News