Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:43 AM

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన
December 18, 2025 02:56 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి మండలం సూరేపల్లి గ్రామ పరిధిలోని ఆకుతోటి బావి తండాకు చెందిన సాలి ధనావత్ ప్రతిష్టాత్మక ఘనత సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టాను ఆమె సొంతం చేసుకున్నారు.

బంజారా మౌఖిక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఏలె విజయలక్ష్మి పర్యవేక్షణలో “యాదాద్రి జిల్లా బంజారా మౌఖిక కథలు – సమగ్ర అధ్యయనం” అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు.

ఈ సందర్భంగా తనను శిష్యవాత్సల్యంతో ప్రోత్సహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కాశీం, కమలాకర శర్మ, సూర్య ధనంజయ్, డాక్టర్ ఎస్. రఘు లకు సాలి ధనావత్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డాక్టరేట్ సాధనలో నిరంతరం తోడుగా నిలిచిన భర్త కెతావత్ మురళీ నాయక్, అత్తమ్మ కేతావత్ చాయమ్మ, మామయ్య నర్సింహలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సాలి ధనావత్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సాహిత్యానికి ఆమె చేసిన కృషి యువ పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News