Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:34 AM

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి
05-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ కాలనీ అభివృద్ధి కోసం జయపాల్ రెడ్డి చేసిన కృషి స్థానికులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రాంతం మంచి భవిష్యత్తు సాధించాలనే ఆశతో ఆయన ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన,2019 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.అనంతరం,2021 లో జయపాల్ రెడ్డి అకాలంగా కన్నుమూయడంతో ప్రాంత ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన కలలు మాత్రం ప్రజల మనసుల్లో జీవించుతూనే ఉన్నాయి.ఆ కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జయపాల్ రెడ్డి భార్య గోపిరెడ్డి రంజిత రెడ్డి, ఆయన అన్న సునీల్ రెడ్డి ప్రజాసేవ పంథాను కొనసాగించాలని నిర్ణయించారు. కాలనీ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేయాలనే లక్ష్యంతో, రాబోయే పురపాలక ఎన్నికల్లో గోపిరెడ్డి రంజిత రెడ్డి సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో జయపాల్ రెడ్డి కుటుంబానికి ప్రజల మద్దతు కీలకంగా మారింది. ప్రజల సహకారం లభిస్తే, పరిధి16 అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన జయపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగాలన్న ఆకాంక్ష స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Sthanikam

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

Article Image

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ కాలనీ అభివృద్ధి కోసం జయపాల్ రెడ్డి చేసిన కృషి స్థానికులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రాంతం మంచి భవిష్యత్తు సాధించాలనే ఆశతో ఆయన ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన,2019 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.అనంతరం,2021 లో జయపాల్ రెడ్డి అకాలంగా కన్నుమూయడంతో ప్రాంత ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన కలలు మాత్రం ప్రజల మనసుల్లో జీవించుతూనే ఉన్నాయి.ఆ కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జయపాల్ రెడ్డి భార్య గోపిరెడ్డి రంజిత రెడ్డి, ఆయన అన్న సునీల్ రెడ్డి ప్రజాసేవ పంథాను కొనసాగించాలని నిర్ణయించారు. కాలనీ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేయాలనే లక్ష్యంతో, రాబోయే పురపాలక ఎన్నికల్లో గోపిరెడ్డి రంజిత రెడ్డి సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో జయపాల్ రెడ్డి కుటుంబానికి ప్రజల మద్దతు కీలకంగా మారింది. ప్రజల సహకారం లభిస్తే, పరిధి16 అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన జయపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగాలన్న ఆకాంక్ష స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News