సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి
సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి
Krishna
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ కాలనీ అభివృద్ధి కోసం జయపాల్ రెడ్డి చేసిన కృషి స్థానికులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రాంతం మంచి భవిష్యత్తు సాధించాలనే ఆశతో ఆయన ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన,2019 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.అనంతరం,2021 లో జయపాల్ రెడ్డి అకాలంగా కన్నుమూయడంతో ప్రాంత ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన కలలు మాత్రం ప్రజల మనసుల్లో జీవించుతూనే ఉన్నాయి.ఆ కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జయపాల్ రెడ్డి భార్య గోపిరెడ్డి రంజిత రెడ్డి, ఆయన అన్న సునీల్ రెడ్డి ప్రజాసేవ పంథాను కొనసాగించాలని నిర్ణయించారు. కాలనీ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేయాలనే లక్ష్యంతో, రాబోయే పురపాలక ఎన్నికల్లో గోపిరెడ్డి రంజిత రెడ్డి సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో జయపాల్ రెడ్డి కుటుంబానికి ప్రజల మద్దతు కీలకంగా మారింది. ప్రజల సహకారం లభిస్తే, పరిధి16 అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన జయపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగాలన్న ఆకాంక్ష స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి