Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 11:54 AM

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం
April 03, 2026 09:32 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

తోటి స్నేహితుడు అకస్మాత్తుగా మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెళితే వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ (37)గ్రామానికి చెందిన అనే యువకుడు అకస్మాత్తుగా మరణించాడు. మృతుడు నరసింహ కు భార్య శిరీష తో పాటు పింకీ, పప్పీ, దిల్ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నరసింహ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించి అకస్మాత్తుగా నరసింహ మరణించడం జరిగింది. దీనితో అతని కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11 టెన్త్ బ్యాచ్ చదువుకున్న మహేష్, అనిల్, శ్రీధర్, నవీన్, మల్లేష్, అనిల్, పరమేష్ ,సాయి, వినోద్ కుమార్, నవీన్, భరత్ తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. అందుకోసం స్నేహితులంతా కలిసి 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవతా దృక్పథంతో సహాయం చేసిన వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల అనూష మల్లేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News