Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:31 PM

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం
April 03, 2026 09:32 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

తోటి స్నేహితుడు అకస్మాత్తుగా మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెళితే వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ (37)గ్రామానికి చెందిన అనే యువకుడు అకస్మాత్తుగా మరణించాడు. మృతుడు నరసింహ కు భార్య శిరీష తో పాటు పింకీ, పప్పీ, దిల్ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నరసింహ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించి అకస్మాత్తుగా నరసింహ మరణించడం జరిగింది. దీనితో అతని కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11 టెన్త్ బ్యాచ్ చదువుకున్న మహేష్, అనిల్, శ్రీధర్, నవీన్, మల్లేష్, అనిల్, పరమేష్ ,సాయి, వినోద్ కుమార్, నవీన్, భరత్ తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. అందుకోసం స్నేహితులంతా కలిసి 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవతా దృక్పథంతో సహాయం చేసిన వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల అనూష మల్లేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News