Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:14 PM

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం
April 03, 2026 09:32 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

తోటి స్నేహితుడు అకస్మాత్తుగా మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెళితే వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ (37)గ్రామానికి చెందిన అనే యువకుడు అకస్మాత్తుగా మరణించాడు. మృతుడు నరసింహ కు భార్య శిరీష తో పాటు పింకీ, పప్పీ, దిల్ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నరసింహ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించి అకస్మాత్తుగా నరసింహ మరణించడం జరిగింది. దీనితో అతని కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11 టెన్త్ బ్యాచ్ చదువుకున్న మహేష్, అనిల్, శ్రీధర్, నవీన్, మల్లేష్, అనిల్, పరమేష్ ,సాయి, వినోద్ కుమార్, నవీన్, భరత్ తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. అందుకోసం స్నేహితులంతా కలిసి 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవతా దృక్పథంతో సహాయం చేసిన వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల అనూష మల్లేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News