స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం
స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం
Vaddeman Suresh
తోటి స్నేహితుడు అకస్మాత్తుగా మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెళితే వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ (37)గ్రామానికి చెందిన అనే యువకుడు అకస్మాత్తుగా మరణించాడు. మృతుడు నరసింహ కు భార్య శిరీష తో పాటు పింకీ, పప్పీ, దిల్ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నరసింహ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించి అకస్మాత్తుగా నరసింహ మరణించడం జరిగింది. దీనితో అతని కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11 టెన్త్ బ్యాచ్ చదువుకున్న మహేష్, అనిల్, శ్రీధర్, నవీన్, మల్లేష్, అనిల్, పరమేష్ ,సాయి, వినోద్ కుమార్, నవీన్, భరత్ తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. అందుకోసం స్నేహితులంతా కలిసి 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవతా దృక్పథంతో సహాయం చేసిన వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల అనూష మల్లేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి