Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:27 AM

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్
28-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సనాతన ధర్మాన్ని ముందుతరాలకు చేరవేసే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఇస్కాన్ టెంపుల్ హిందూ ధర్మకర్త పరమానంద దాస్ పేర్కొన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథ దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులతో సమావేశమయ్యారు.

భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం, ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి చిన్నారులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పరమానంద దాస్ అన్నారు. సనాతన ధర్మ విలువలను పరిరక్షిస్తూ, వాటిని భావితరాలకు అందించడం సమాజ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని సూచించారు.ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్ర బిందువులని ఆయన పేర్కొన్నారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు కుటుంబాలు, గురువులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు భగవద్గీత ప్రతులను అందజేశారు.కార్యక్రమంలో శివప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఎరుపుల నరసింహ, ఎరుపుల వెంకన్న, దేవాలయ అర్చకులు అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్

Article Image

సనాతన ధర్మాన్ని ముందుతరాలకు చేరవేసే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఇస్కాన్ టెంపుల్ హిందూ ధర్మకర్త పరమానంద దాస్ పేర్కొన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథ దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులతో సమావేశమయ్యారు.

భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం, ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి చిన్నారులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పరమానంద దాస్ అన్నారు. సనాతన ధర్మ విలువలను పరిరక్షిస్తూ, వాటిని భావితరాలకు అందించడం సమాజ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని సూచించారు.ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్ర బిందువులని ఆయన పేర్కొన్నారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు కుటుంబాలు, గురువులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు భగవద్గీత ప్రతులను అందజేశారు.కార్యక్రమంలో శివప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఎరుపుల నరసింహ, ఎరుపుల వెంకన్న, దేవాలయ అర్చకులు అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News