Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం
January 04, 2026 03:44 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ జెండా ఎగరాలి

ప్రతీ బీజేపీ కార్యకర్త గెలుపే లక్షంగా పట్టు కొమ్మలుగా పని చెయ్యాలి

సన్సద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా గ్రామీణ పట్టణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.కె.శ్రీనివాస్ స్థానికం(జనవరి 04)

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న “సన్సద్ ఖేల్ మహోత్సవ్” సన్నాహక సమావేశం బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షాతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని,ప్రతీ బీజేపీ కార్యకర్త గెలుపే లక్షంగా పట్టు కొమ్మలుగా పని చెయ్యాలని అన్నారు. సన్సద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా గ్రామీణ పట్టణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ...వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం “ఫిట్ ఇండియా ఖేల్ ఇండియా”సంకల్పానికి అనుసంధానంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ మహోత్సవం రూపుదిద్దుకుంటోంది.భువనగిరి నియోజక వర్గంలో ఈ క్రీడా మహోత్సవాన్ని ఘన విజయం చేయడానికి బీజేపీ పార్టీ శ్రేణులు,క్రీడాభిమానులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఇంచార్జ్ వర్ధన్ మాట్లాడుతూ...సంస్థ గతంగా పార్టీని బలోపేతం చెయ్యాలి,పూర్తి స్థాయిలో అన్ని బూత్ కమిటీలు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమం మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతాంశెట్టి రవీందర్,దాసరి మల్లేశం,వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్,పడమటి జగన్ మోహన్ రెడ్డి,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కదూరి అచ్చయ్య,చందా మహేందర్ గుప్తా,కొప్పుల యాదిరెడ్డి,జిల్లా కార్యదర్శి మెడికోటేష్,భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం,మంగు నర్సింహా రావు,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు డి.ఎల్.ఎన్ గౌడ్,యువమోర్చ జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్,మహమూద్,సీనియర్ నాయకులు సర్వీ శ్రీనివాస్ గౌడ్,బంధరపు లింగస్వామి,వివిధ మండల అధ్యక్షులు మరియు మోర్చా అధ్యక్షులు,బీజేపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News