Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్
December 28, 2025 08:42 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై భానూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 184/2025గా కేసు నమోదు చేశారు. ఈ కేసును BNS సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పరిశ్రమ భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ రాజ్ సిన్హాను నిందితుడిగా గుర్తించారు.

ఈ క్రమంలో నిన్న తేది 27.12.2025 సాయంత్రం అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యుల పాత్రపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పరిశ్రమల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News