Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:19 AM

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్
December 28, 2025 08:42 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై భానూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 184/2025గా కేసు నమోదు చేశారు. ఈ కేసును BNS సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పరిశ్రమ భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ రాజ్ సిన్హాను నిందితుడిగా గుర్తించారు.

ఈ క్రమంలో నిన్న తేది 27.12.2025 సాయంత్రం అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యుల పాత్రపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పరిశ్రమల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News