Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు
January 14, 2026 02:37 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్త జీవితానికి నాంది పలకాలి – ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలి

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో బోగీ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త జీవితానికి నాంది పలికే బోగీ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సౌఖ్యాలు తీసుకురావాలని కోరారు. రైతు సోదరులతో పాటు వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, కమిషన్ దారులు, ఖరీదుదారులు, మిల్లర్లు, హమాలీలు, దడువయిలు, గుమస్తాలు, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు అందరికీ బోగీ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి మంటల వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. పురాణాల ప్రకారం వామన అవతారంలో భగవంతుడు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా నియమించి, సంక్రాంతి పండుగకు ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని వరం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుకే సంక్రాంతి పండుగకు ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని వివరించారు.

గతంలో ఎదురైన కష్టనష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగి మంటల్లో తగలబెట్టి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే భోగి పండుగ సారాంశమని ఆయన తెలిపారు. దక్షిణాయణంలో ఎదురైన కష్టాలను అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణంలో సానుకూల శక్తితో, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా, ఐక్యతతో బోగీ పండగను జరుపుకోవాలని కోరుతూ మరోసారి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News