సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు
సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు
Biksham
కొత్త జీవితానికి నాంది పలకాలి – ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలి
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో బోగీ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త జీవితానికి నాంది పలికే బోగీ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సౌఖ్యాలు తీసుకురావాలని కోరారు. రైతు సోదరులతో పాటు వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, కమిషన్ దారులు, ఖరీదుదారులు, మిల్లర్లు, హమాలీలు, దడువయిలు, గుమస్తాలు, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు అందరికీ బోగీ శుభాకాంక్షలు తెలిపారు.
భోగి మంటల వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. పురాణాల ప్రకారం వామన అవతారంలో భగవంతుడు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా నియమించి, సంక్రాంతి పండుగకు ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని వరం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుకే సంక్రాంతి పండుగకు ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని వివరించారు.
గతంలో ఎదురైన కష్టనష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగి మంటల్లో తగలబెట్టి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే భోగి పండుగ సారాంశమని ఆయన తెలిపారు. దక్షిణాయణంలో ఎదురైన కష్టాలను అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణంలో సానుకూల శక్తితో, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా, ఐక్యతతో బోగీ పండగను జరుపుకోవాలని కోరుతూ మరోసారి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి