Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:20 AM

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు
January 14, 2026 02:37 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్త జీవితానికి నాంది పలకాలి – ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలి

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో బోగీ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త జీవితానికి నాంది పలికే బోగీ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సౌఖ్యాలు తీసుకురావాలని కోరారు. రైతు సోదరులతో పాటు వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, కమిషన్ దారులు, ఖరీదుదారులు, మిల్లర్లు, హమాలీలు, దడువయిలు, గుమస్తాలు, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు అందరికీ బోగీ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి మంటల వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. పురాణాల ప్రకారం వామన అవతారంలో భగవంతుడు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా నియమించి, సంక్రాంతి పండుగకు ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని వరం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుకే సంక్రాంతి పండుగకు ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని వివరించారు.

గతంలో ఎదురైన కష్టనష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగి మంటల్లో తగలబెట్టి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే భోగి పండుగ సారాంశమని ఆయన తెలిపారు. దక్షిణాయణంలో ఎదురైన కష్టాలను అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణంలో సానుకూల శక్తితో, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా, ఐక్యతతో బోగీ పండగను జరుపుకోవాలని కోరుతూ మరోసారి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News