సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం
సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వినూత్న రాజకీయ శైలి
నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరోసారి తన రాజకీయ శైలితో ప్రజలమనసులుగెలుచుకుంటున్నారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయారు.ఉదయం చిట్యాల పట్టణంలోని ఓ సాధారణ హోటల్లో టిఫిన్ చేసి, అక్కడే స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా, ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పనిచేయాలనే తన రాజకీయ తత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు.ప్రజల మధ్యే తిరుగుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. అందుబాటులో ఉండే నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.సేవాభావంతో, నిరాడంబర రాజకీయంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా ఎమ్మెల్యే వీరేశం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతోచిట్యాలమున్సిపాలిటీలోకాంగ్రెస్పార్టీనిఘనవిజయానికనడిపించాలనే సంకల్పంతో ఆయన ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి