Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
May 18, 2026 10:02 PM 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ,గురుకుల హాస్టళ్లలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులు అనగా స్వీపర్లు, వాచ్‌మెన్‌లకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటకొండ కృష్ణప్ప, జిల్లా అధ్యక్షులు ఎం.మల్లేష్ తదితర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లలో రాత్రింబవళ్లు పనిచేస్తున్న పేద స్వీపర్లు, వాచ్‌మెన్‌లకు 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వమే తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.

*మే 30న జిల్లాస్థాయి సమావేశానికి పిలుపు*

అదేవిధంగా మే 30వ తేదీన పుట్టపర్తిలోని బీసీ బాయ్స్ హాస్టల్‌ నందు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లు అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇదాయతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News