సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ,గురుకుల హాస్టళ్లలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులు అనగా స్వీపర్లు, వాచ్మెన్లకు ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటకొండ కృష్ణప్ప, జిల్లా అధ్యక్షులు ఎం.మల్లేష్ తదితర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లలో రాత్రింబవళ్లు పనిచేస్తున్న పేద స్వీపర్లు, వాచ్మెన్లకు 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వమే తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.
*మే 30న జిల్లాస్థాయి సమావేశానికి పిలుపు*
అదేవిధంగా మే 30వ తేదీన పుట్టపర్తిలోని బీసీ బాయ్స్ హాస్టల్ నందు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లు అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇదాయతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి