Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు
March 09, 2026 05:28 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. రాజుల అధిక శిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గిరిజనుల ఆత్మాభిమానాన్ని చాటుతూ పోరాటంలో అమరులైన వీరవనితలు సమ్మక్క, సారలమ్మల త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులు స్మరించుకున్నారు.సుమారు 1200 సంవత్సరాల క్రితం అడవి బిడ్డలు చేసిన త్యాగాల చరిత్రను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎడ్యుకేషనల్ టూర్‌ను నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. మేడారం చరిత్రను వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనాలను, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్రను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. చిక్కలగుట్ట ప్రాంతం, మేడారం అడవిని ప్రత్యక్షంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయులు తవ్వించిన లక్నవరం చెరువును సందర్శించి దాని ప్రాధాన్యతను తెలుసుకున్నారు. నీటిపారుదల కోసం కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థపై అవగాహన పొందారు. అనంతరం కాకతీయులు నిర్మించిన ఐనవోలు మల్లన్న దేవాలయాన్ని సందర్శించారు.వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతాలను పుస్తకాలలో మాత్రమే చదివామని, ఈ ఎడ్యుకేషనల్ టూర్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ చిలువేరు దుర్గయ్య, డైరెక్టర్ కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, నాగలక్ష్మి, మహేష్, సువర్ణ, శ్రీదేవి, బాలరాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News