సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు
సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు
K.RAVI
నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. రాజుల అధిక శిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గిరిజనుల ఆత్మాభిమానాన్ని చాటుతూ పోరాటంలో అమరులైన వీరవనితలు సమ్మక్క, సారలమ్మల త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులు స్మరించుకున్నారు.సుమారు 1200 సంవత్సరాల క్రితం అడవి బిడ్డలు చేసిన త్యాగాల చరిత్రను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎడ్యుకేషనల్ టూర్ను నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. మేడారం చరిత్రను వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనాలను, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్రను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. చిక్కలగుట్ట ప్రాంతం, మేడారం అడవిని ప్రత్యక్షంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయులు తవ్వించిన లక్నవరం చెరువును సందర్శించి దాని ప్రాధాన్యతను తెలుసుకున్నారు. నీటిపారుదల కోసం కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థపై అవగాహన పొందారు. అనంతరం కాకతీయులు నిర్మించిన ఐనవోలు మల్లన్న దేవాలయాన్ని సందర్శించారు.వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతాలను పుస్తకాలలో మాత్రమే చదివామని, ఈ ఎడ్యుకేషనల్ టూర్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ చిలువేరు దుర్గయ్య, డైరెక్టర్ కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, నాగలక్ష్మి, మహేష్, సువర్ణ, శ్రీదేవి, బాలరాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి