Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:04 AM

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు
March 09, 2026 05:28 PM 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. రాజుల అధిక శిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గిరిజనుల ఆత్మాభిమానాన్ని చాటుతూ పోరాటంలో అమరులైన వీరవనితలు సమ్మక్క, సారలమ్మల త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులు స్మరించుకున్నారు.సుమారు 1200 సంవత్సరాల క్రితం అడవి బిడ్డలు చేసిన త్యాగాల చరిత్రను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎడ్యుకేషనల్ టూర్‌ను నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. మేడారం చరిత్రను వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనాలను, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్రను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. చిక్కలగుట్ట ప్రాంతం, మేడారం అడవిని ప్రత్యక్షంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయులు తవ్వించిన లక్నవరం చెరువును సందర్శించి దాని ప్రాధాన్యతను తెలుసుకున్నారు. నీటిపారుదల కోసం కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థపై అవగాహన పొందారు. అనంతరం కాకతీయులు నిర్మించిన ఐనవోలు మల్లన్న దేవాలయాన్ని సందర్శించారు.వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతాలను పుస్తకాలలో మాత్రమే చదివామని, ఈ ఎడ్యుకేషనల్ టూర్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ చిలువేరు దుర్గయ్య, డైరెక్టర్ కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, నాగలక్ష్మి, మహేష్, సువర్ణ, శ్రీదేవి, బాలరాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News