సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి
సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి
Editor Desk
ఎర్రుపాలెం,
అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్లో సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు.
సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దల ప్రభాకరరావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక వివక్షత, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం సుందరయ్య జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.
శ్రమజీవుల హక్కులు, పేదల ఆత్మగౌరవం కోసం రాజీలేని పోరాటాలు చేసిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. “దున్నేవానికి భూమి” నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదని తెలిపారు.
నేటి సమాజంలో పెరుగుతున్న దోపిడీ, అసమానతలపై మరింతగా పోరాటాలు అవసరమని, పేదల సంక్షేమం, నవ సమాజ నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో దూదిగం బసవయ్య, నక్క పుల్లారావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోటి సుబ్బారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి