Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి
19-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం,

అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్‌లో సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు.

సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దల ప్రభాకరరావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక వివక్షత, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం సుందరయ్య జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.

శ్రమజీవుల హక్కులు, పేదల ఆత్మగౌరవం కోసం రాజీలేని పోరాటాలు చేసిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. “దున్నేవానికి భూమి” నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదని తెలిపారు.

నేటి సమాజంలో పెరుగుతున్న దోపిడీ, అసమానతలపై మరింతగా పోరాటాలు అవసరమని, పేదల సంక్షేమం, నవ సమాజ నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో దూదిగం బసవయ్య, నక్క పుల్లారావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోటి సుబ్బారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి

Article Image

ఎర్రుపాలెం,

అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్‌లో సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు.

సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దల ప్రభాకరరావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక వివక్షత, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం సుందరయ్య జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.

శ్రమజీవుల హక్కులు, పేదల ఆత్మగౌరవం కోసం రాజీలేని పోరాటాలు చేసిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. “దున్నేవానికి భూమి” నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదని తెలిపారు.

నేటి సమాజంలో పెరుగుతున్న దోపిడీ, అసమానతలపై మరింతగా పోరాటాలు అవసరమని, పేదల సంక్షేమం, నవ సమాజ నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో దూదిగం బసవయ్య, నక్క పుల్లారావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోటి సుబ్బారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News