సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ
సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ
Krishna
నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆసుపత్రి నర్సులను శాలువాలతో సన్మానించి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ నర్సులు వైద్య రంగానికి వెన్నెముకలాంటివారని, రోగుల ఆరోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి నర్సు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు విజయ కుమారి , లక్ష్మమ్మ,శంకరమ్మ మౌనిక, పుష్ప, వెంకట్ లక్ష్మీ ,సీనియర్ జర్నలిస్టులు విఠల్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి