Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

సమాజ నిర్మాణంలో భాగస్వామిగా మారిన మహిళలు అన్నింట పోటీపడాలి

సమాజ నిర్మాణంలో భాగస్వామిగా మారిన మహిళలు అన్నింట పోటీపడాలి

సమాజ నిర్మాణంలో భాగస్వామిగా మారిన మహిళలు అన్నింట పోటీపడాలి
March 08, 2026 09:20 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

టీఎన్జీవో యూనియన్ - కోదాడ యూనిట్ కార్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

టీఎన్జీవో యూనిట్ సంఘ ప్రాథమిక సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అటు ఇంట్లో గృహిణీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ,ఇటు ఉద్యోగం లో రాణిస్తూ సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు టీఎన్జీవో కోదాడ యూనిట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై సమాజంలో మహిళలు ఎదుగుతున్న తీరు, అధిగమిస్తున్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీఎన్జీవో కోదాడ యూనిట్ సంఘ ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉద్యోగులు బత్తిని మమత, రమాదేవి, రాధిక, మాతంగి స్రవంతి, నసీమ, మంజుల, కందుల ఝాన్సీ, దున్న లావణ్య, మాధవి, అరుణ, పిడమర్తి సునీత, పులిపాటి లావణ్య, లక్ష్మీ, శ్రీధర్, వేంకటనగేష్, మట్టపల్లి మహేశ్, గంటెపొంగు విక్రమ్ సాయిరాంరెడ్డి, పులి శ్రీనివాస్, రుద్రాక్షి భాస్కర్, రాజేష్, జగదీష్, పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News