Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:33 PM

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
07-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (నల్గొండ) బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వృక్షశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో "ఆరోగ్యవంతమైనభూమండలం కోసం జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు" అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సు పోస్టర్‌ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఉపకులపతిమాట్లాడుతూ, "విశ్వవిద్యాలయాలు సమాజ హితమైన ప్రయోగాలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలి. భూమి ఆరోగ్యాన్ని పెంపొందించే జీవశాస్త్ర పరిశోధనలు రైతులకు, పర్యావరణానికి దోహదపడతాయి" అని అన్నారు. ఈ సదస్సు ద్వారా శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనలు పంచుకుని, ఆచరణాత్మక చర్యలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, డా.కె.ప్రేమ్‌సాగర్, డా.మాధురి, ఆచార్యలు వసంత, అన్నపూర్ణ, ఆర్‌ఎస్ బుట్టి, డా.శివరాం, డా.రామచందర్ గౌడ్ పాల్గొన్నారు. విభాగ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉత్సాహంగా చర్చించారు.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ 2024 అక్టోబర్‌లో మళ్లీ ఉపకులపతిగా నియమితులయ్యారు.మునుపటి మూడేళ్ల పదవిలో (2016-2019) విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి కృషి చేశారు. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం సమాజ సేవా దిశగా ముందడుగు.

Sthanikam

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

Article Image

సమాజ హిత ప్రయోగాలకు కేంద్రాలు విశ్వవిద్యాలయాలు : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (నల్గొండ) బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వృక్షశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో "ఆరోగ్యవంతమైనభూమండలం కోసం జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు" అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సు పోస్టర్‌ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఉపకులపతిమాట్లాడుతూ, "విశ్వవిద్యాలయాలు సమాజ హితమైన ప్రయోగాలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలి. భూమి ఆరోగ్యాన్ని పెంపొందించే జీవశాస్త్ర పరిశోధనలు రైతులకు, పర్యావరణానికి దోహదపడతాయి" అని అన్నారు. ఈ సదస్సు ద్వారా శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనలు పంచుకుని, ఆచరణాత్మక చర్యలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, డా.కె.ప్రేమ్‌సాగర్, డా.మాధురి, ఆచార్యలు వసంత, అన్నపూర్ణ, ఆర్‌ఎస్ బుట్టి, డా.శివరాం, డా.రామచందర్ గౌడ్ పాల్గొన్నారు. విభాగ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉత్సాహంగా చర్చించారు.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ 2024 అక్టోబర్‌లో మళ్లీ ఉపకులపతిగా నియమితులయ్యారు.మునుపటి మూడేళ్ల పదవిలో (2016-2019) విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి కృషి చేశారు. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం సమాజ సేవా దిశగా ముందడుగు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News