Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ
January 13, 2026 09:15 AM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బాధితుడైన బేగరీ రాములను SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్, దళిత సంఘ నాయకులు కే. శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యుడైన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకురావడంతో, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు.అనంతరం జహీరాబాద్ డీఎస్పీ సైద నాయక్ గారిని కలిసి ఘటన వివరాలు తెలియజేయగా, అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు అందించాలని సూచిస్తూ, బాధితులు ధైర్యంగా ఉండాలని, వారికి న్యాయం జరుగుతుందని డీఎస్పీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News