సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ
సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ
Sthanikam District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బాధితుడైన బేగరీ రాములను SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్, దళిత సంఘ నాయకులు కే. శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యుడైన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకురావడంతో, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు.అనంతరం జహీరాబాద్ డీఎస్పీ సైద నాయక్ గారిని కలిసి ఘటన వివరాలు తెలియజేయగా, అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు అందించాలని సూచిస్తూ, బాధితులు ధైర్యంగా ఉండాలని, వారికి న్యాయం జరుగుతుందని డీఎస్పీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి