Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:42 PM

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ
January 13, 2026 09:15 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బాధితుడైన బేగరీ రాములను SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్, దళిత సంఘ నాయకులు కే. శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యుడైన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకురావడంతో, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు.అనంతరం జహీరాబాద్ డీఎస్పీ సైద నాయక్ గారిని కలిసి ఘటన వివరాలు తెలియజేయగా, అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు అందించాలని సూచిస్తూ, బాధితులు ధైర్యంగా ఉండాలని, వారికి న్యాయం జరుగుతుందని డీఎస్పీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News