Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:48 PM

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ
13-01-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బాధితుడైన బేగరీ రాములను SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్, దళిత సంఘ నాయకులు కే. శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యుడైన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకురావడంతో, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు.అనంతరం జహీరాబాద్ డీఎస్పీ సైద నాయక్ గారిని కలిసి ఘటన వివరాలు తెలియజేయగా, అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు అందించాలని సూచిస్తూ, బాధితులు ధైర్యంగా ఉండాలని, వారికి న్యాయం జరుగుతుందని డీఎస్పీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

సజ్జాపూర్ ఘటన బాధితుడికి దళిత సంఘాల అండ

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బాధితుడైన బేగరీ రాములను SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్, దళిత సంఘ నాయకులు కే. శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యుడైన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకురావడంతో, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేశారు.అనంతరం జహీరాబాద్ డీఎస్పీ సైద నాయక్ గారిని కలిసి ఘటన వివరాలు తెలియజేయగా, అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు అందించాలని సూచిస్తూ, బాధితులు ధైర్యంగా ఉండాలని, వారికి న్యాయం జరుగుతుందని డీఎస్పీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News