Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

సిరిపురంలో రైతుల ఆందోళన

సిరిపురంలో రైతుల ఆందోళన

సిరిపురంలో రైతుల ఆందోళన
05-01-2026 1,534 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు విఘాతం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సోమవారం రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన ప్రమాణాలకు తగిన విధంగా లేదని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కాల్వపై నిర్మిస్తున్న వంతెనకు అవసరమైన ఎత్తు లేకపోవడంతో పాటు రోడ్డుకు సంబంధించిన క్రాసింగ్‌ను సరిగా డిజైన్ చేయలేదని రైతులు ఆరోపించారు.


గ్రామ రైతులను సంప్రదించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కాల్వ వద్ద ధర్నాకు దిగారు.ఇలాగే పనులు కొనసాగితే వ్యవసాయ భూములకు వెళ్లే రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని వంతెన ఎత్తును పెంచడంతో పాటు క్రాసింగ్ వద్ద లెవెల్ సెట్ చేసి నిర్మాణాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో ఉప సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్‌తో పాటు కూనూరి ముత్తయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, గుంటూజి కృష్ణమాచారి, బల్గూరి అంజయ్య, ఏళ్ల వెంకట నరసయ్య, కట్ట శేఖర్ రెడ్డి, బెడద రమేష్, నర్రా నర్సిరెడ్డి, ఏళ్ల మల్లారెడ్డి, గజం సత్యనారాయణ, మోటి మల్లేశం వడ్లపల్లి శ్రీనివాస్, పొట్ట బత్తుల వెంకటేష్, అప్పం వెంకటేష్, దూలం రవి, పబ్బు మల్లయ్య, దయ్యాల శ్రీశైలం, మోటి రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో రైతుల ఆందోళన

Article Image

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు విఘాతం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సోమవారం రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన ప్రమాణాలకు తగిన విధంగా లేదని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కాల్వపై నిర్మిస్తున్న వంతెనకు అవసరమైన ఎత్తు లేకపోవడంతో పాటు రోడ్డుకు సంబంధించిన క్రాసింగ్‌ను సరిగా డిజైన్ చేయలేదని రైతులు ఆరోపించారు.


గ్రామ రైతులను సంప్రదించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కాల్వ వద్ద ధర్నాకు దిగారు.ఇలాగే పనులు కొనసాగితే వ్యవసాయ భూములకు వెళ్లే రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని వంతెన ఎత్తును పెంచడంతో పాటు క్రాసింగ్ వద్ద లెవెల్ సెట్ చేసి నిర్మాణాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో ఉప సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్‌తో పాటు కూనూరి ముత్తయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, గుంటూజి కృష్ణమాచారి, బల్గూరి అంజయ్య, ఏళ్ల వెంకట నరసయ్య, కట్ట శేఖర్ రెడ్డి, బెడద రమేష్, నర్రా నర్సిరెడ్డి, ఏళ్ల మల్లారెడ్డి, గజం సత్యనారాయణ, మోటి మల్లేశం వడ్లపల్లి శ్రీనివాస్, పొట్ట బత్తుల వెంకటేష్, అప్పం వెంకటేష్, దూలం రవి, పబ్బు మల్లయ్య, దయ్యాల శ్రీశైలం, మోటి రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News