సైన్స్ తో సమాజ అభివృద్ధి ఎంఈఓ సైదా నాయక్
సైన్స్ తో సమాజ అభివృద్ధి ఎంఈఓ సైదా నాయక్
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మండలంలో ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్యాల మండల విద్యాధికారి గుగులోతు సైదా నాయక్ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, సైన్స్ నిత్య జీవితంలో భాగమని తెలిపారు. విద్యార్థులు సైన్స్ను శ్రద్ధతో నేర్చుకొని నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈ టాలెంట్ టెస్ట్లో జడ్పిహెచ్ఎస్ నేరడ పాఠశాలకు చెందిన మిరియాల సంయుక్త ప్రథమ బహుమతి, జడ్.పి.హెచ్.ఎస్ పెద్దకాపర్తి పాఠశాలకు చెందిన బత్తుల శశాంక్ ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలకు ఎంఈఓ బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్కు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు వీరమల్ల నాగయ్య, కోఆర్డినేటర్లు బిక్షం రెడ్డి, యశోద రెడ్డి, చిట్యాల జడ్.పి.హెచ్.ఎస్ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి