Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక
January 05, 2026 01:58 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

విశాఖపట్టణంలో జరిగిన సిఐటియూ18వ ఆల్ ఇండియా మహాసభలో సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కల్లూరి మల్లేశం ఎన్నిక అయినట్టు సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలియజేశారు.డిసెంబర్ 31వ తేది నుండి జనవరి 04వ తేదీ వరకు విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియం హాల్ లో మహాసభలు జరిగాయని తెలంగాణ రాష్ట్రం నుండి మొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున ఎన్నికైనట్టు తెలియజేశారు. గతంలో ఎస్ఎఫ్ఐ రామన్నపేట డివిజన్ కార్యదర్శిగా,ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా,కేంద్ర కమిటి సభ్యులుగా,సిఐటియూ ఉమ్మడి జిల్లా కమిటి సభ్యులుగా,గొర్రెలు,మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శిగా,ఉమ్మడి జిల్లా సహకార సంఘం డైరెక్టర్ గా,యాదాద్రి భువనగిరి జిల్లా టి మాస్ కన్వీనర్ గా,సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులుగా,జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు.ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.గత 27 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై వివిధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్నానని పనిని గుర్తించి నాయకత్వం నాకు జాతీయ కమిటీలో బాధ్యతను అప్పగించిందని తెలియజేశారు.రానున్న రోజులలో కార్మిక సమస్యలపై ప్రజాఉద్యమాలను నిర్వహిస్తూ సిఐటియూ పటిష్టత కోసం కృషి చేస్తానని,కార్మిక సంఘాల ఐక్యత కోసం,ఐక్య ఉద్యమాల కోసం పనిచేస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News