Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:05 AM

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక

సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం ఎన్నిక
January 05, 2026 01:58 PM 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

విశాఖపట్టణంలో జరిగిన సిఐటియూ18వ ఆల్ ఇండియా మహాసభలో సిఐటియూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కల్లూరి మల్లేశం ఎన్నిక అయినట్టు సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలియజేశారు.డిసెంబర్ 31వ తేది నుండి జనవరి 04వ తేదీ వరకు విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియం హాల్ లో మహాసభలు జరిగాయని తెలంగాణ రాష్ట్రం నుండి మొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున ఎన్నికైనట్టు తెలియజేశారు. గతంలో ఎస్ఎఫ్ఐ రామన్నపేట డివిజన్ కార్యదర్శిగా,ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా,కేంద్ర కమిటి సభ్యులుగా,సిఐటియూ ఉమ్మడి జిల్లా కమిటి సభ్యులుగా,గొర్రెలు,మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శిగా,ఉమ్మడి జిల్లా సహకార సంఘం డైరెక్టర్ గా,యాదాద్రి భువనగిరి జిల్లా టి మాస్ కన్వీనర్ గా,సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులుగా,జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు.ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.గత 27 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై వివిధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్నానని పనిని గుర్తించి నాయకత్వం నాకు జాతీయ కమిటీలో బాధ్యతను అప్పగించిందని తెలియజేశారు.రానున్న రోజులలో కార్మిక సమస్యలపై ప్రజాఉద్యమాలను నిర్వహిస్తూ సిఐటియూ పటిష్టత కోసం కృషి చేస్తానని,కార్మిక సంఘాల ఐక్యత కోసం,ఐక్య ఉద్యమాల కోసం పనిచేస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News