Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం
01-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని, ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారికి సకాలంలో సిలిండర్లు అందుతాయని స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్‌లను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.

అదే సమయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానాన్ని అమలు చేస్తున్నామని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాలను మంత్రి సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని, ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారికి సకాలంలో సిలిండర్లు అందుతాయని స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్‌లను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.

అదే సమయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానాన్ని అమలు చేస్తున్నామని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాలను మంత్రి సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News