సగం ధరకు ఇండక్షన్ స్టవ్లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం
సగం ధరకు ఇండక్షన్ స్టవ్లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని, ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారికి సకాలంలో సిలిండర్లు అందుతాయని స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్లను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.
అదే సమయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానాన్ని అమలు చేస్తున్నామని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాలను మంత్రి సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి