Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 11:51 AM

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం
April 01, 2026 09:58 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని, ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారికి సకాలంలో సిలిండర్లు అందుతాయని స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్‌లను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.

అదే సమయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానాన్ని అమలు చేస్తున్నామని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాలను మంత్రి సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News